YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి

రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి

ఇబ్రహీంపట్నం
వరంగల్ లో జరుగనున్న  రాహుల్ గాంధి సభను విజయవంతం చేయాలని  కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రాంరెడ్డి  కోరారు.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాం రెడ్డి మాట్లాడుతూ మే ఆరున వరంగల్ లో   జగిగే రైతు సంఘర్షణ సభకు వస్తున్నల  కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. అందుకోసం ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గనేందుకు ముందుకు రావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం తోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పండించిన పంటకు సరైన మద్దతు ధర రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క దళారుల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన దరణిలో అనేక లోపాలు ఉన్నయని దండెం రాంరెడ్డి ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, పేద ప్రజలకు దున్నుకొని బ్రతకడానికి భూములు ఇస్తే,  ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి హెచ్ఎండిఎ వెంచర్ల పేరిట అసైన్డ్ భూములను రైతుల దగ్గర్నుంచి తీసుకుంటున్నారు.  రియల్ ఎస్టేట్ దళారులు రాష్ట్రంలోని అసైన్డ్ భూములను రైతులకు నయానా భయానా ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులను మోసం చేసే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో నిర్వహించే రైతు సంఘర్షణ మహాసభకు ప్రతి ఒక్కరు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీపతి గౌడ్, కొత్తకుర్మా శివ కుమార్, తాళ్లపల్లి కృష్ణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts