YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

65వ జాతీయ రహదారిపై వరుసగా ఎనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీ

65వ జాతీయ రహదారిపై వరుసగా ఎనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీ

సంగారెడ్డి  ఏప్రిల్ 30
జిల్లాలోని రుద్రారం వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. రుద్రారం వద్ద 65వ జాతీయ రహదారిపై వరుసగా ఎనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో హైదరాబాద్‌ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర వైపు వెళ్లె వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన లారీ, మూడు వ్యాన్లు, నాలుగు కార్లను క్రేన్ల సహాయంతో రోడ్డుపైనుంచి పక్కకు తరలిస్తున్నారు.

Related Posts