హైదరాబాద్ జూన్ 28
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న సతీశ్చంద్ర శర్మ.. ఢిల్లీకి బదిలీ అయ్యారు. గత నాలుగేళ్లలో తెలంగాణ హైకోర్టుకు.. ఐదుగురు సీజేలు బాధ్యతలు చేపట్టినట్లు అయ్యింది.కాగా సీజే ప్రమాణస్వీకార నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ రాభవన్కు రావడం ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆయన గవర్నర్ అధికారిక భవనానికి రావడం గమనార్హం.