హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలి సై ను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి తో పాటు ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం కలిసారు. ఎస్సై, కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తలెత్తిన సమస్యలపై గవర్నర్ కు నివేదించారు.
శివసేన రెడ్డి మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్ మెంట్ చేసిన తప్పిదాలకు లక్షలాది మంది యువత బలయ్యారు. బోర్డు చైర్మన్ వి.వి శ్రీనివాస్ దృష్టికి పదే పదే తీసుకెళ్లిన స్పందించడం లేదు. 7 మార్కులు కలపాలని హైకోర్టు సూచించినా చేయడం లేదు. ప్రభుత్వం, బోర్డు పట్టించుకోవడం లేదు.. దీంతో గవర్నర్ ను కలిశాం. డ్రైవింగ్ కోసం చేసే రిక్రూట్ మెంట్ కు కూడా రన్నింగ్ , లాంగ్ జంప్ పెట్టారు. బోర్డు చైర్మన్ 3 మీటర్లు కూడా రాయి విసరలేదు.. విద్యార్థులు 6 మీటర్లు విసరాలా. ఇప్పటి వరకు 18 మంది విద్యార్థులు చనిపోయారు. వారికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి. రన్నింగ్ క్వాలిఫై ఆయిన వారిని మెయిన్ కు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరాం. కోర్టు సూచన మేరకు మార్కులు కలపాలి. ప్రభుత్వం స్పందించకపోతే.. కేసీఆర్ అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తామని అన్నారు.