YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

గణతంత్ర వేడుకలకు బాబు దూరం.. కారణమిదే!, జెండా ఎగరేసిన గవర్నర్, భువనేశ్వరి హాజరు

గణతంత్ర వేడుకలకు బాబు దూరం.. కారణమిదే!, జెండా ఎగరేసిన గవర్నర్, భువనేశ్వరి హాజరు

- జెండా ఎగరేసిన గవర్నర్, భువనేశ్వరి హాజరు

గణతంత్ర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకాలేకపోయారు. దావోస్ నుంచి ఆయన గురువారం రాష్ట్రానికి బయలుదేరారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది.

శుక్రవారం ఉదయం 7గంటలకు ఆయన అమరావతి రావాల్సి ఉండగా...అబుదాబిలో పొగమంచు కారణంగా విమానం ఆలస్యమైంది. దీంతో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు.

 

అక్కడ ఉన్న సిబ్బందికి ఆమె మిఠాయిలు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అమరావతి చేరుకోనున్నారు.

Related Posts