YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నుంచి వైకాపాలో చేరికలు

టీడీపీ నుంచి వైకాపాలో చేరికలు

నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 12 వార్డులో బుధవారం రాత్రి  టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు జరిగాయి.  నర్సీపట్నం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి,  సిట్టింగ్ ఎమ్మెల్యే  పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు ఒక రౌడీ,  ఆయన పెద్ద కొడుకు ఏదైనా చేస్తాడు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరే వారిని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, రౌడీయిజం చేస్తే ప్రజలు తొక్కేస్తారని, అల్లిపూడి అయ్యన్నపాత్రుడు ఆయన పెద్దకొడుకు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని,  పొట్టోడు అని విమర్శలు చేసే అయ్యన్నపాత్రుడు తన ఇంట్లోనే ఒక మరుగుజ్జు ఉన్నాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఎన్నికల్లోను ఇవే ఇవే చివరి ఎన్నికలు అంటూ ఓటర్ల సానుభూతి కోసం అయ్యన్నపాత్రుడు ప్రయత్నిస్తాడు. 2019లో కూడా ఇవే చివరి ఎన్నికలు అన్నాడు. తన వయసు ఒకసారి 67 సంవత్సరాలని ఒకసారి అంటాడు.. ఇంకోసారి 167 సంవత్సరాల అంటున్నాడు. మన గ్రామాల్లోకి ప్రతి సంవత్సరం పిట్టలదొరలు వస్తుంటారు. ఏకతాటిగా మాట్లాడుతారు.  అయ్యన్నపాత్రుడు పెద్దకొడుకు పిట్టలదొర మాదిరిగా, ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికల ప్రచారంలోకి వస్తాడు. ఏవేవో చెప్తాడు. ఎన్నికల తర్వాత ఎక్కడికో పోయి వ్యాపారాలు చేసుకుంటాడని అన్నారు.

Related Posts