YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సవాల్ కు భయపడిన రేవంత్ కేటీఆర్

సవాల్ కు భయపడిన రేవంత్ కేటీఆర్

హైదరాబాద్
తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ పాల్గోన్నారు.కేటీఆర్ మట్లాడుతూ రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజిగిరిలో పోటీకి రావాలి.
తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి,  పోటీకి  వస్తే మా అభ్యర్థిని బతిమిలాడుకొని నేను పోటీలో నిలబెడతా ననఅ అన్నారు. అంత పెద్ద ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా తర్వాత కూడా రేవంత్ రెడ్డి బయపడుతున్నాడు. రేవంత్ రెడ్డి పిరికోడు.. మాటలు ఎక్కువ చెప్తాడు కానీ.. సవాలు స్వీకరించే దమ్ములేదు. మల్కాజ్గిరి లో పోటీ చేయాలని నేను విసిరిన సవాలు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయాడు. నా సవాలు పైన ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి భయంతో మాట్లాడడం లేదు. మల్కాజ్గిరి లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ బలాన్ని చూసి ముఖ్యమంత్రి మౌనం వహించారు. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో లంక బిందెల సంగతేమో కానీ… హైదరాబాద్ నగరంలో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి. లంకెల బిందెల కోసం తట్ట, పారాలు పట్టుకొని, అర్ధరాత్రి చీకట్లో కరుడుగట్టిన దొంగలు తిరుగుతారు. ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం పట్ల ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు.
రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి… నరేంద్ర మోడీని చౌకీదారు చోర్ హై అంటే రేవంత్ రెడ్డి మాత్రం మా బడే భాయ్ అంటున్నాడు. అదాని ఫ్రాడ్ అని రాహుల్ అంటే… రేవంత్ రెడ్డి హమారా ఫ్రెండ్ హై అంటున్నాడు. మా తెలంగాణ మాడల్ కాదు… గుజరాత్ మోడల్ చేస్తా అని రేవంత్ రెడ్డి అంటుండు.  గుజరాత్ మోడల్ అంటే గోద్ర హింస చేస్తారా… బుల్డోజర్లు తీసుకొచ్చి పేద ప్రజల పైకి నడిపిస్తాడా రేవంత్ రెడ్డి చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ మనిషివా… నరేంద్ర మోడీ మనిషివా… బీజేపీ మనిషివా… కాంగ్రెస్ నేతవా… రేవంత్ రెడ్డి చెప్పాలే. ఒక్క ఓటు కాంగ్రెస్ కు వేసినా, అది నేరుగా బిజెపికి లాభం జరుగుతుంది. 30- 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలోకి పోయేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బిజెపిలోకి వెళ్తాడు ఇదే జరుగుతుంది. ఈ అంశం పైన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి తిరగని పార్టీ దేశంలో లేదని అన్నారు.
ఏబీవీపీ నుంచి టిఆర్ఎస్ కి, టిఆర్ఎస్ నుంచి టీడీపీకి, టిడిపి నుంచి కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నుంచి మళ్లీ బిజెపి మాతృ సంస్థకి వెళ్తాడు. అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ అన్యాయం అంటాడు కానీ అదే కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం కరెక్టే అంటాడు. రాహుల్ గాంధీ కరెక్టా లేదా రేవంత్ రెడ్డి కరెక్టా అనేది కాంగ్రెస్ చెప్పాలి. ఆరు గ్యారంటీలు పోయినవి… ఆరు గారఢీలు మోపైంది. రేవంత్ రెడ్డి స్కాములు, స్కీముల, ట్యాపింగ్ పేర్లతో డ్రామాలు ఎందుకు. పాలన చేతకావడం లేదు కాబట్టే లీకు వీరుడిగా మారిండు. ఆరు గ్యారంటీలు అడిగి తంతారనే భయంతో ఈ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుండు. ఈరోజు పోటీ… పదేండ్ల నిజానికి… వందరోజుల అబద్దానికి… పదేళ్ల విషం బిజెపికి మధ్య జరుగుతున్న పోటీ అని అన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చి అన్ని వర్గాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ అనే నిజం ఒకవైపు… ఇచ్చిన హామీలన్నింటిని పక్కనపెట్టి అబద్ధాలతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఇంకోవైపు… 10 సంవత్సరాలుగా సమాజంలో విషయం నింపుతున్న బిజెపి ఇంకోవైపు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి
రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం సంక్షోభంలో చిక్కుకున్నా… కరువుతో సతమతమవుతున్నా.. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నా… ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకున్న రేవంత్ రెడ్డి పైన యువత కోపంగా ఉన్నారు. రాష్ట్ర రైతాంగము, ఆపద పాలైన ఆటో డ్రైవర్లు, పెన్షన్ రెట్టింపు కానీ వృద్ధులు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, 2500 కాంగ్రెస్ హామీ రాని మహిళలు ఇలా అన్ని వర్గాలు  ఈ ప్రభుత్వం పైన ఆగ్రహంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని యూట్యూబ్లో అడ్డగోలుగా పార్టీ పైన, పార్టీ నాయకత్వం పైన మొరిగే కుక్కల పైన మనం దాడులు చేయాల్సిన అవసరం లేదు… ఓటు ద్వారానే బుద్ధి చెబుతాం. ఓటుతోని ఇలాంటి సన్నాసుల పైన వేసే వేటే సమాధానం కావాలని అన్నారు.
ఈటెల రాజేందర్ అన్న హుజూరాబాద్ లో గజ్వేల్ లో ఓడిపోతే మల్కాజిగిరి కి వచ్చిండు. హుజూరాబాద్ లో సెంటిమెంట్ మాటలు చెప్పి… గెలిచిన తర్వాత ముఖం చాటేసిండు. రాజేందర్ అన్న నువ్వు టిఆర్ఎస్ లో ఉన్న అనుకుంటున్నావ్… మీ బీజేపి, నరేంద్ర మోడీ 14.50 లక్షల కోట్లు కార్పొరేట్లకు, రుణాలు మాఫీ చేసినారు గాని రైతన్నలకు ఒక రూపాయి మాఫీ చేయలేదు. అటువంటి పార్టీలో ఉండి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటదని అన్నారు.
దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ, బిజెపి మల్కాజిగిరికి, కంటోన్మెంట్ కి ఏం చేసిందో చెప్పి ఈటెల ఓటు అడగాలి. 609 వ స్థానంలో ఉన్న అదానిని తీసుకువచ్చి రెండో స్థానంలో కూర్చొపెట్టినందుకు నరేంద్ర మోడీ నీతిమంతుడా. రాజకీయాలలో సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం అది మన రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఉన్నది. మల్కాజిగిరిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు అంతా కెసిఆర్ గారి ద్వారా పదవులు పొంది వెన్నుపోటు పొడిచి వెళ్లిన వాళ్ళే, వాళ్లుకు బుద్ది చేప్పాలి.  మల్కాజిగిరిలో నిలబడింది లక్ష్మారెడ్డి  కాదు మన గులాబీ సైనికులంతా నిలబడ్డారు అన్నట్లు పనిచేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులతో పాటు పార్టీనే స్వయంగా పోటీలో ఉందని కష్టపడి గెలిపించుకుందాం. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మూడున్నర లక్షల మెజార్టీ మన పార్టీకి ఉన్నది. అయినా మనం మన కార్పొరేటర్ ఎన్నికల స్థాయిలో, సర్పంచ్ ఎన్నిక స్థాయిలో మల్కాజ్గిరి లో పనిచేద్దాం. దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి… మన అభ్యర్థి ఎంత తిరిగినా… మన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు విస్తృతంగా పర్యటనలు ప్రచారం చేయాలని అన్నారు.

Related Posts