బయ్యారం
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం బయ్యారం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలనీ. రాష్ట్రంలో మాదిరిగానే కేంద్రములో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 2022 వరకు దేశములో ఉన్న పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో బిజెపి చెప్పు మాట తప్పింది.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టిచ్చారో భాజపా నేతలు చెప్పాలి.బిజెపి, బిఆర్ఎస్ లకు ఓటు అడిగే హక్కు లేదు,అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీ లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి దక్కింది అన్నారు.కేంద్ర మంత్రిగా బలరామ్ నాయక్ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు,గతం లో గెలిచిన సీతారామ్ నాయక్, కవిత, నియోజకవర్గానికి చేసింది శూన్యం అన్నారు. కేంద్రియ విద్యాలయం తెచ్చి పేద విద్యార్థులకు పెద్ద దిక్కు అయ్యారు, మోడల్ స్కూల్స్, ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో రోడ్లు, బ్రిడ్జ్ లు కట్టిన ఘనత బాలరామ్ నాయక్ కి దక్కింది అన్నారు.బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారు,మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం,మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు 10 లక్షల జీవిత భీమా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని బలరాం నాయక్ ఎంపీ గా ఉంటే మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని అన్నారు.