YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కేటీఆర్

ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కేటీఆర్

సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను  మాజీ మంత్రి కెటిఆర్ పరిశీలించారు. కెటిఆర్ మాట్లాడుతూ చేస్తానన్న రుణమాఫీ చేయలేదు కదా, బ్యాంకుల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ, మెడపైన కత్తి పెట్టి రుణాలు కడతారా చస్తారా అన్నట్లు ఉంది. ఎండిన పోయిన పది పదిహేను లక్షలు ఎకరాలను రాష్ట్రవ్యాప్తంగా మా ఎమ్మెల్యేలతో పరిశీలుస్తున్నాం. రైతులను చూస్తే నిజంగానే బాదేస్తుంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ వద్ద కుంగిపోను మూడు పిల్లర్లు వద్ద కాపర్ డామ్ కడితె అయిపోయేది. ఢిల్లీకి జాతరలు , యాత్రలు తప్పితే రాష్ట్రానికి రేవంత్ చేసిందేమీ లేదు. కౌలు రైతులు, రైతులకు చేస్తానన్న లబ్ది చేకూర్చాలి. రైతులకు ఇస్తానన్న క్వింటాలుకు 500 బోనస్ వెంటనే ఇవ్వాలి. రైతులు ధైర్యంగా ఉండండి మేం ఉన్నాం. రైతులు ఆత్మహత్యలు లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని అన్నారు.

Related Posts