YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భుజాన శవాన్ని వేసుకొని...

భుజాన శవాన్ని వేసుకొని...

ఏలూరు, ఏప్రిల్ 10
అల్లూరి సీతారామరాజు జిల్లాలో హృదయవిదారకర ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయితీ చిన్న కోనల గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ గ్రామానికి సారా కొత్తయ్య, భార్య సీత ఇద్దరూ గుంటూరు జిల్లాలోని ఓ ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు ఏరియా ఇటుక బట్టి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నారు. రెండో కుమారుడికి రెండు రోజుల క్రితం జబ్బు చేసింది. తీవ్ర అనారోగ్యంపాలైన ఆ బాలుడిని గుంటూరు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందారు. బాలుడిని స్వగ్రామానికి తరలించేందుకు ఇటుక బట్టి యాజమాన్యం ప్రత్యేక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. రావులపాలెం గ్రామంలో అంబులెన్స్ ఎక్కించారు. సాయంత్రం బయల్దేరిన అంబులెన్స్‌ తెల్లవారుజాము రెండు గంటలకి విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ గ్రామానికి చేరుకుంది. అంతకంటే ముందుకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేని కారణంగా బాలుడి శవాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్లిపాయాడా డ్రైవర్. అక్కడి నుంచి బాలుడు శవాన్ని తీసుకెళ్లేందుకు వాహనాలు రాక వేరే వాళ్లు సాయం చేయలేదు. అంతే తండ్రి తన బిడ్డ శవాన్ని భుజంపై వేసుకొని వేకువజామున బయల్దేరాడు. రెండు ఎత్తైన కొండలు, ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉదయం 8 గంటలకు ఊరు చేరుకున్నాడు. కుమారుడి శవాన్ని అంత్యక్రియలు నిర్వహించాడు. దారి లేకపోవడంతో 8కిలోమీటర్లు శవాన్ని భుజాన వేసుకొని ప్రయాణించిన వీడియో మాత్రం వైరల్‌గా మారుతోంది. ఈ వార్తపై ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల స్పందించారు. మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వెయ్యండి అని అడిగేవాళ్లకు ఈ వార్త చూసైనా కనువిప్పు కలగాలన్నారు." ఆరోగ్యశ్రీని అట్టకెక్కించడంతో ఆసుపత్రిలో సరైన వైద్యం ఎలాగూ అందటంలేదు. కనీసం చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇంటికి చేర్చుకోలేని దుస్థితిలో ప్రజలు  ఉన్నారంటే  అధికార పార్టీ సిగ్గుపడాలి. మేము అది చేశాం ఇది చేశాం అని డబ్బాలు కొట్టుకోవటం కాదు. పేదోడి కనీస అవసరాలు తీర్చలేని మీ ప్రభుత్వం ఎందుకు?. మళ్లీ మీరు రాజన్న వారసులం అని చెప్పుకుంటారు? ఇలానే ఉంటుందా రాజన్న పాలనా? అందుకే చెబుతున్నాం ఓటు అనే ఆయుధంతో వీళ్లకు బుద్ది చెప్పండి. అని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వెయ్యండి అని అడిగేవాళ్లకు ఈ వార్త చూసైనా కనువిప్పు కలగాలి. ఆరోగ్యశ్రీని అట్టకెక్కించడంతో ఆసుపత్రిలో సరైన వైద్యం ఎలాగూ అందటంలేదు.. కనీసం చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇంటికి చేర్చుకోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారంటే అధికార పార్టీ

Related Posts