YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రంపచోడవరంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్ది కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం

రంపచోడవరంలో  బీజేపీ  పార్లమెంట్ అభ్యర్ది  కొత్తపల్లి గీత  ఎన్నికల ప్రచారం

అరకు
అరకు పార్లమెంట్  రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత . సీతపల్లి గ్రామంలో శ్రీ గడి  బాపనమ్మ  అమ్మవారి దర్శనం అనంతరం ప్రచార ర్యాలీ రథంపై  ప్రారంభించి రంపచోడవరం మెయిన్ రోడ్ వరకు కొనసాగిన ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. అనంతరం అంబేద్కర్ సెంటర్ లో యున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన కొత్తపల్లి గీత. ఈ సందర్భంగా రోడ్ షో లో మాట్లాడుతూ  రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి ఇదే నాంది .  అనంతరం అడ్డతీగలలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో  రాస్టంలో  జగన్ సైకో అయితే ఇక్కడ మరో సైకో అనంత బాబు అని . గిరిజనులను అడ్డంపెట్టుకొని  రాజకీయం చేస్తున్నాడని ఆమె తెలిపారు .  
MLA  అభ్యర్ది  మిరియాల శిరిశా దేవి మాటాడుతూ  అనంత బాబు ఏజస్సీ గిరిజనుల పేరుతో దోపిడి సాగిస్తున్నాడని విమర్శించారు ... ఉమ్మడి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి రానున్న ఎన్నికలలో అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, మరియు రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల శిరీష ను గెలిపించాలని పిలుపునిచ్చారు . ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు,ఉమ్మడి పార్టీల కార్యకర్తలు, మహిళామణులు, నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా నీరాజనాలు అందించారు.....

Related Posts