YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పోలీసుపై దాడి

పోలీసుపై దాడి

హైదరాబాద్
సైదాబాద్ లో  విధి నిర్వహణలో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పై  ఓ యువకుడు దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
ఈ ఘటన సైదాబాద్ పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.  సంతోష్ నగర్ కు చెందిన కృష్ణదొర మల క్ పేట పీఎస్ లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. మంగళ వారం ఉదయం సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఆయనకు సైదాబాద్ పీఎస్ నుంచి మాధవనగర్ కాలనీలో రహదారిపై వ తండ్రీ కొడుకులు గొడవ పడుతున్నారని వెళ్లి చూడాలని సమాచారం అందింది. దీంతో ఆయన సిబ్బందితో సహా అక్కడికి వెళ్లగా మాధవనగర్ కు చెందిన జి.కోటప్ప అతని కుమారుడు వరుణ్ గొడవ పడుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణదొర వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వరుణ్ దుర్భాషలాడుతూ అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీంతో సైదాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా  వరుణ్.  అతని తల్లి జ్యోతి, మరో ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి  తప్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన దృశ్యాలు సిసి కేమెరా లో రికార్డ్ అయ్యాయి

Related Posts