సికింద్రాబాద్
సిక్కు మత ఆవిర్భావాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ గురు ద్వారాలో జరిగిన భైసఖి వేడుకలు, ప్రత్యేక పూజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సిక్కులు అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. గురు ఆశీర్వచనాలు కోరుకున్నట్లు వెల్లడించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు