YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మృతుడు ఎగిరి కారుపై పడిన వైనం వాహనంపై పడిన మృత దేహంతో 18కి.మీ దూరం ప్రయాణo

మృతుడు ఎగిరి  కారుపై పడిన వైనం వాహనంపై పడిన మృత దేహంతో 18కి.మీ దూరం ప్రయాణo

అనంతపురం
వై. కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం దారుణ  ఘటన జరిగింది. ఒక కారు డ్రైవర్ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దాంతో బైకు మీదున్న వ్యక్తి కారుపై పడి మృతి చెందాడు.  మృతదేహం కారు మీదే వుండిపోయింది. కారు డ్రైవర్ దాదాపు 18 కిమీ దూరం ప్రయాణించాడు. వివరాలు ఇలా వున్నాయి. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జిన్నే ఎర్రిస్వామి(35) ట్రాక్టర్ మెకానిక్.  వ్యక్తిగత పనులపై పి. సిద్దరాంపురం వెళ్లి ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణం అయ్యాడు. వై. కొత్తపల్లి సమీపంలోకి రాగానే కళ్యాణదుర్గం వైపు వెళుతున్న కారు.. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. దాంతో ఎర్రిస్వామి ఎగిరి కారుపైన పడిపోయాడు. గమనించని డ్రైవర్ వేగంగా కళ్యాణదుర్గం వైపు పయనం అయ్యాడు. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద కారుపై వ్యక్తి పడి ఉండటాన్ని వాహనదారులు గమనించి, అడ్డంగా వెళ్లి ఆపించారు.  డ్రైవర్ కారును వదిలి పరార్ అయ్యాడు. కారు బెంగళూరుకు చెందినదిగా గుర్తించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Related Posts