YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గత ప్రభుత్వ నేరాలు ఒక్కోటి బయటికి వస్తున్నాయి

గత ప్రభుత్వ నేరాలు ఒక్కోటి బయటికి వస్తున్నాయి

సూర్యాపేట
సూర్యాపేట లో భద్రాచలం ఎమ్మెల్యే , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు మీడియాతో మాట్లాడారు. నాలుగు నెలలుగా గత ప్రభుత్వ పాపాలను వెలికి తీస్తున్నారు. పాత నేరాలన్ని ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఒక వైపు హామీల అమలు జరుపుతూనే , కేసీఆర్ పాపాల ప్రక్షాళన కాంగ్రెస్ చేస్తోంది. బీజేపీ ,కేసీఆర్ రైతు దీక్షలు చూసి సమాజం నవ్విపోతుంది.
బీజేపీ గత పదేళ్ళుగా రైతులకు ఎం చేశారు చెప్పి కిషన్ రెడ్డి దీక్షలు చేయాలి. పదేళ్ళుగా బీజేపీ చేయనివి 4 నెలల్లో కాంగ్రెస్ చేయాలని ఎలా ప్రశ్నిస్తారు. పదేళ్ళు బీజేపీ , కేసీఆర్ రైతులను పట్టించుకోలేదు. నాలుగు నెలల్లో కాంగ్రెస్ కొంతైనా ప్రజలకు మేలు చేస్తుంది. ఎన్నికల కోడ్ వల్లే హామీల అమలు ఆలస్యం అవుతుంది. ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.
సంక్షేమం పట్టించుకోకపోతే బీజేపీ , బీ ఆర్ ఎస్ కి వేసిన శిక్షే ప్రజలు కాంగ్రెస్ కి వేస్తారు. నాలుగు నెలల కాలానికే ఎందుకు బీజేపీ , బీ ఆర్ ఎస్ పార్టీలకు ఎందుకు అంత ఉలుకు. ఎవరు అవునన్నా కాదన్నా కమ్యూనిస్టులు బలపరిచిన కూటమికే ఎన్నికల్లో విజయం రానుంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కె మెజారిటీ సీట్లు వస్తాయి. కమ్యూనిస్టుల స్నేహం కాంగ్రెస్ కి కలిసి వస్తుంది. గతంలో ఎకరాకు 10 వేలు పంట నష్టపరిహారం అన్న కేసీఆర్ అవి ఇవ్వలేదుగాని ఇప్పుడు 25 వేలు ఇవ్వాలని అడగడం హాస్యాస్పదం. అకాల వర్షాలకు , సాగు నీరు లేక ఎండిన పంటలకు ఎకరాకు 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు.

Related Posts