YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పామర్రు నియోజకవర్గంలో ఎన్డీఏ నేతల ఎన్నికల ప్రచారం

పామర్రు నియోజకవర్గంలో ఎన్డీఏ నేతల ఎన్నికల ప్రచారం

పామర్రు
కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని రాపర్ల, జమీదగ్గుమిల్లి,  ఉండ్రపూడి గ్రామాల్లో ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన బాలశౌరి.... కుమార్ రాజాకుపార్టీ నేతలు  ఘన స్వాగతం పలికారు. ఎంపి వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ ఢిల్లీలో కష్టపడి అయిన మనకు కావాల్సిన అభివృద్ధి నిధులు తీసుకువస్తాను. సైనికుల్లా 27 రోజులు అందరం కష్టపడితే,విజయం మనదే. .రాష్ట్రంలో అయిదేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది. గతంలో పనిచేసిన ఎందరో సీఎంలు బావి తరాల అభివృద్ధికి కృషి చేసేవారు. కానీ నేడు రాష్ట్రంలో జరుగుతుంది ఏంటో అందరికీ తెలుసు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్లు విడుదల చేస్తున్న..... రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా విడుదల కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఓటు షిఫ్టింగ్ అనేది చాలా చాలా ముఖ్యం, సమన్వయం లోపాన్ని అదిగమించి కార్యకర్తలు పనిచేయాలని అన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ అందరం కలిసి మెలిసి పనిచేస్తూ, మన సత్తా ఏంటో  చాటి చెబుదాం. త్రాగునీరు,సాగునీరు అందించలేని పనికిమాలిన ఎమ్మెల్యేను మనమెందుకు సహించాలి.  పామర్రు నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి ముచ్చకైన కనబడటం లేదు. జగన్ దుర్మార్గం ప్రజలకు అర్థమైంది, వాలంటీర్లు కూడా అర్థం చేసుకోండి ప్రజల పక్షాన నిలవండి. ఆదాయాన్ని పెంచి ప్రజల మంచి కోసం ఖర్చుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు . జగన్ & కో చేసిన విధ్వంసం, అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్పై ఉంది,కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయకత్వం ఆక్సిజన్లా బతికిస్తుందని అన్నారు.

Related Posts