సికింద్రాబాద్
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు మద్దతుగా బోయిన్ పల్లిలో నిర్వహించిన సమావేశంలో రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ లాస్య నందిత అకాల మరణంతో ఉప ఎన్నికల్లో వచ్చిన నేపథ్యంలో లాస్య సోదరి నివేదితను కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఎన్నికల బరిలో నిలవడం ఆమెకు ప్రచారంలో అనూహ్య ప్రజాస్పందన లభిస్తుండడం గెలుపు సునాయసమని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటోన్మెంట్ లో ఉచిత మంచినీరు, చెరువుల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి పనులు కూడా జరిగాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కంటోన్మెంట్ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ స్వల్ప కాలంలోనే ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన తనలో మనోధైర్యాన్ని నింపి మరోసారి టికెట్ కేటాయించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 30ఏళ్లుగా సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు అనేక సేవలు చేశారని వారిని ఆదర్శంగా తీసుకొని పని చేస్తానని ప్రజలకు హామీనిచ్చారు. తన జీవితాన్ని కంటోన్మెంట్ ప్రజలకే అంకితం ఇస్తానని చెప్పారు.