రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మక్తగూడ గ్రామం పరిధిలో కుక్కల దాడికి అడవి జింక మృతి చెందింది.. గ్రామ శివారు లోని పొలాల లోకి జింక రావడం తో జింక పై కుక్కలు దాడి చేశాయి..దాడి చేస్తుండడంతో అక్కడే పొలం లో పని చేస్తున్న రైతులు బెదిరించడం తో కుక్కలు పారిపోయాయి. కాని అప్పటికే కుక్కల దాడి లో తీవ్ర గాయాలు అయిన జింక అక్కడే మృతి చెందింది. అటవీ శాఖ అధికారుల కు సమాచారం తెలియజేయడం తో వారు మృతి చెందిన జింకను పరిశీలన చేసి వారి వెంట తీసుకొని వెళ్లారు