అదిలాబాద్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగ అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణ ని గెలిపించాలని కోరుతూ జిన్నారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో వాళ్ల బాగోగులు వివరాలు తెలుసుకొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం వచ్చిన 100 రోజుల్లో మహిళలకు బస్ ప్రయాణం 500 కే గ్యాస్ సిలిండర్ 2008 లోపల ఉచిత వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం ఎన్నికల కోడ్ రావాలని కారణంగా రుణమాఫీ ఆగస్టు 15 లోపు రెండు లక్షల లోపు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విద్యావంతురాలు ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి సుగుణ గారిని మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకి పంపుదాం. రాహుల్ గాంధీని ప్రధాని చేసి దేశ అభివృద్ధిలో భాగస్వాములవుదాం
గతంలో ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. మన్మోహన్ సింగ్ పెట్టిన ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.