YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కార్యకర్తలను ఆదుకుంటా దానం నాగేందర్

కార్యకర్తలను ఆదుకుంటా దానం నాగేందర్

హైదరాబాద్
సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బూతు స్థాయి మరియు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం   జరిగింది.  సికింద్రాబాద్ కాంగ్రెస్  అభ్యర్థి దానం నాగేందర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎంతోమంది కార్యకర్తలు బాధపడ్డారు. ప్రజల కష్టాలను, వారి సమస్యలను  పరిష్కరించేందుకు తాను ముందుంటానని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం  
లో ఎమ్మెల్యే మాగంటి అభివృద్ధిని మరచి  మహిళలకు ప్లాస్టిక్ డబ్బాలు పంచుతున్నారని,  దీనివలన మహిళలకు ఒరిగిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో అనేక మందిపై కేసులు పెట్టించి కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. ఆయన హయాంలో కేవలం రౌడీ షీటర్లను పెంచి పోషించారు తప్ప, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. మాగంటి గోపీనాథ్  చిట్టా బయట ఒకటి తీస్తే చాంతాడంత  ఉంటుందని దానం నాగేందర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ లో కార్యకర్తలను హింసిస్తే ఎవరినైనా  తా ట తీస్తామని హెచ్చరించారు..

Related Posts