YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రజనీ, నాగార్జున కలిసి సినిమా

రజనీ, నాగార్జున కలిసి సినిమా

చెన్నై, ఏప్రిల్ 22
కప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు కూడా మల్టీ స్టారర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో హీరోలు ఎక్కువగా ఎవరు ప్రాజెక్ట్స్‌లో వారు బిజీగా ఉండడంతో ఇతర హీరోలతో కలిసి నటించే అవకాశం ఎక్కువగా ఉండడం లేదు. కానీ తమిళంలో మాత్రం రెగ్యులర్‌గా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్స్‌ను వర్కవుట్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు దర్శకులు. అందుకే 32 ఏళ్ల క్రితం కలిసి నటించిన నాగార్జున, రజనీకాంత్ కాంబినేషన్‌ను మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వర్కవుట్ అయ్యేలా చేయాలని చూస్తున్నాడు ఓ యంగ్ డైరెక్టర్. రజనీ హీరోగా నటించనున్న తరువాతి చిత్రంలో నాగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.సూపర్ స్టార్ రజనీకాంత్ మల్టీ స్టారర్ సినిమాలకు ఎప్పుడూ నో చెప్పరు. ఆయన చివరి చిత్రం ‘జైలర్’లో కూడా కన్నడ హీరో శివ రాజ్‌కుమార్, మలయాళ స్టార్ మోహన్‌ లాల్‌తో కలిసి నటించారు. ఇప్పుడు నాగార్జునతో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో రజనీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘తలైవార్ 171’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగార్జున కూడా నటించనున్నట్టు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం నాగార్జున మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం మరెందరో స్టార్లను రంగంలోకి దించనున్నాడట లోకేశ్.
‘తలైవార్ 171’లో నాగార్జున కూడా ఓ పాత్ర చేస్తే బాగుంటుందని ఆయనను సంప్రదించాడట దర్శకుడు లోకేశ్ కనకరాజ్. అయితే నాగార్జున ఇంకా ఈ మూవీని ఓకే చేశారా లేదా అన్న విషయం మాత్రం బయటికి రాలేదు. ఒకవేళ ఇదే నిజమయితే 32 ఏళ్ల తర్వాత నాగార్జున, రజనీకాంత్‌ను ఒకే స్క్రీన్‌పై చూడనున్నారు ప్రేక్షకులు. వీరిద్దరూ చివరిగా 1991లో విడుదలయిన ‘శాంతి క్రాంతి’ అనే చిత్రంలో కలిసి కనిపించారు. ఇక నాగార్జున సైతం ఎప్పటినుండి అయినా మల్టీ స్టారర్లను ఎక్కువగానే ఇష్టపడతారు. ప్రస్తుతం ధనుష్‌తో కలిసి ‘కుబేర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు నాగ్. ఇప్పుడు రజనీకాంత్ మూవీని కూడా కచ్చితంగా ఓకే చేస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు.నాగార్జునను మాత్రమే కాదు... ఇంతకు ముందే ‘తలైవార్ 171’లో గెస్ట్ రోల్ చేయడం కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ను కూడా సంప్రదించాడట లోకేశ్ కనకరాజ్. సౌత్ సినిమాలు అన్నా.. సౌత్ యాక్టర్స్ అన్నా.. రణవీర్‌కు ఇష్టం కాబట్టి ఈ గెస్ట్ రోల్‌ను తాను ఓకే చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం నాగార్జున, రణవీర్ సింగ్ పేర్లు మాత్రమే బయటికొచ్చినా.. మరెందరో స్టార్లను కూడా ఈ సినిమా కోసం సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నాడట లోకేశ్. ప్రస్తుతం రజనీకాంత్.. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టయాన్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే ‘తలైవార్ 171’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు.

Related Posts