మేడ్చల్
కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం తూముకుంట మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ తో పాటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి , మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రాష్ యాదవ్ ఉన్నారు.