పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో మానేరు నదిపై నిర్మించిన బ్రిడ్జి గాడార్స్ అర్ధరాత్రి గాలిదుమారానికి కూలిపోయింది. ఓడేడు నుండి జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్ళపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు మానేరునది పై 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణంలో కొద్దిరోజులు పనులు కొనసాగా బ్రిడ్జి నిర్మాణం ఎస్టిమేషన్ ఎక్కువ కావడంతో పనులను నిలిపివేశారు. బ్రిడ్జి నాసిరకం పనుల వల్ల కుప్పకూలిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మానేరునది పై నిర్మాణ పనులకు శంకుస్థాపన అయి 9 సంవత్సరాలు కావస్తున్నా అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఇప్పుడు అర్ధరాత్రి ఇలా కూలడంతో బిర్జు నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక రోడ్డుపై ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఆరోపించారు.