YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంకా తెలని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

ఇంకా తెలని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

ఖమ్మం
ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ది విషయం ఇంకా తేలలేదు. ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి తరుపున రెండు సెట్లు నామినేషన్ కాంగ్రెస్ నేతలు వేసారు. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తనయుడు రఘురామ్ రెడ్డి. రఘురామ్ రెడ్డి మంత్రి పొంగులేటికి వియ్యంకుడు. రఘురామ్ రెడ్డి తరుపున నామినేషన్ అయన బంధువులు నూకల నరేష్ రెడ్డి,బొర్రా రాజశేఖర్, స్వర్ణకుమారి, నిరంజన్ రెడ్డి, కోటా రాంబాబు వేసారు. ఎన్నో మలుపులు తిరిగిన కాంగ్రెస్ అభ్యర్థి విషయం చివరకు కొలిక్కి వచ్చి మళ్ళీ స్థానికేతరునికే పట్టం అధిష్టానం కట్టింది. కాంగ్రెస్ అధిష్టానం రఘురామ్ రెడ్డి పేరు బహిరంగ ప్రకటన మాత్రమే మిగిలింది

Related Posts