YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హనుమాన్ విజయ దినోత్సవంలో పాల్గోన్న ఈటల

హనుమాన్ విజయ దినోత్సవంలో పాల్గోన్న ఈటల

సికింద్రాబాద్
హనుమాన్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వర దేవాలయం వద్ద శివాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక హాజరయ్యారు.  ఈటెల రాజేందర్ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం పార్టీలో చేరిన కోనేరు బావి ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈటల రాజేందర్ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మల్కాజ్గిరి లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ బూత్ స్థాయిలో కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

శంషాబాద్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాజేంద్రనగర్నియోజకవర్గంలోనిశంషాబాద్ లో నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.  యువతలో భక్తి భావం పెరగడం దేశ ఐక్యతకు చిహ్నమని ఆయన చెప్పారు. 15 ఏళ్లుగా శంషాబాద్ లో శోభాయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభినందించారు.  అయితేఓవైపు యువకుల్లో భక్తి భావం పెరుగుతుండగా.కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసంహనుమాన్,గుడినికూల్చి వేయడాన్ని ఆయనతప్పుపట్టారు.  చిన్ని పేద్దలతో సంస్కృతి కార్యక్రమాలు చేపట్టారు.   ఈకార్యక్రమంలోరాజేంద్రనగర్నియోజకవర్గ బీజేపీనాయకులు,కార్యకర్తలు,కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts