రంగారెడ్డి
బిజెపి కాంగ్రెస్ పార్టీ తోడు దొంగలని బిజెపికి ఓటు వేసిన కాంగ్రెస్ కి ఓటు వేసిన ఒకటేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు.... బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేవెళ్ల ఎంపీ స్థానానికి తన నామినేషన్ వేశారు. అంతకుముందు బండ్లగూడ ఆర్ఎ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించిన కాసాని జ్ఞానేశ్వర్ అక్కడి నుండి భారీ ర్యాలీగా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదుగా రాజేంద్ర నగర్ ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్నారు.ఈ ర్యాలీలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు రిటర్నింగ్ అధికారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక కు నామినేషన్ పత్రాలను సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ ,అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, తో కలిసి ఎంపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సమర్పించారు.