సికింద్రాబాద్
రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతుందని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సర్వే నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అసలైన కాంగ్రెస్ వాదులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అవేదన వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు.కంటోన్మెంటకాంగ్రెస్ బి ఫామ్ ఇస్తే కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని లేని పక్షంలో కాంగ్రెస్ రెబల్ గా బరిలో ఉంటానన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారిని చేర్చుకుని సీట్లు కేటాయించడం సరైన విధానం కాదన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన మార్చుకోకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ సాధ్యం కాధని, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను విస్మరించడం తగదని హెచ్చరించారు.లోక్ సభ లో మాదిగలకు సీట్లు కేటాయించడంలో కాంగ్రెస్ విఫలమైందని, కోటి మంది జనాభా కలిగిన దళితులు కాంగ్రెస్ కు దూరమయ్యే అవకాశం ఉందని అన్నారు.