YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆగష్టు 15 లోపు రైతు రుణమాఫీ నిజం అయితే...

ఆగష్టు 15  లోపు రైతు రుణమాఫీ నిజం అయితే...

మెదక్:
ఆగష్టు 15  లోపు రైతు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే అమరవీరుల స్థూపం వద్దకు సిఎం రేవంత్ రెడ్డి రావాలని మాజీ మంత్రి, ఎంఎల్ఎ హరీష్ రావు సవాల్ విసిరారు. అమరవీల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో తాను వస్తానని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే రావాలన్నారు. మెదక్ రోడ్ షో లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ‘రాజీనామా లేఖలను ఇద్దరం కలిసి మేధావులు చేతిలో పెడదాం. సిఎం రేవంత్ రెడ్డి చెప్పినవి అమలు చేస్తే తన రాజీనామా లేఖను ఆ మేధావులు స్పీకర్ కు ఇస్తారు. చేయకుంటే రేవంత్ రాజీనామా లేఖను గవర్నర్ కు ఇస్తారు. రాజీనామాకు సిద్ధమేనా అని అడుగుతున్నానని సవాల్ విసిరారు.  గతంలో కొడంగల్ లో రాజకీయ సన్యాసం తీసుకుంటా అని రేవంత్ తోక ముడిచాడని, ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులు, బి ఆర్ ఎస్ పార్టీ అంటే ఎండ కూడా బయపడుతుందని, 25 సంవత్సరాలలో మెదక్ లో గులాబీ జెండా ఎగురుతుందని వేరే జెండా ఎగురడం లేదు, మెదక్ జిల్లా గులాబీ అడ్డా, మళ్ళీ బి ఆర్ ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.10 ఏళ్లలో కెసిఆర్ ఏం చేశారని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. కెసిఆర్ తోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, కెసిఆర్ నిర్మించిన కలెక్టర్ ఆఫీస్ కు నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారన్నారు. పేగులు మెడలో రాక్షసులు వేసుకుంటారని సిఎం స్థాయి తగ్గించుకొని మాట్లాడాలి, మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదని ఘాటుగా విమర్శించారు. జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ కాలేజీలు కెసిఆర్ తెచ్చారు, అందమైన నాలుగు లైన్ రహదార్లు వేశామని చెప్పుకొచ్చారు.వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ అమలు అని బాండ్ పేపర్ మీద రాశారు, బాండ్ పేపర్ పరువు తీశారు, దేవుళ్ళను రాజకీయాలకు వాడుతున్నారు, రేవంత్ ఎవరి మీద ఓట్లు పెట్టినా జనాలు నమ్మడం లేదని చురకలంటించారు. ఆరు హామీలు అమలు కాలేదు కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి కి తన ఎత్తు గురించి ధ్యాస ఉంది గాని రైతుల సమస్య పట్ల ధ్యాసే లేదు అని మండిపడ్డారు. 200 పైగా రైతులు, 30 మంది ఆటో కార్మికులు చనిపోయినా కూడా వారి కుటుంబాలను రేవంత్ పరామర్శించడం లేదని ధ్వజమెత్తారు.బిజెపి రఘునందన్ మాటలు నమ్మడమంటే నీళ్లు లేని బావిలో దూకడమే నయం, దుబ్బాకల అలాగే మాట్లాడితే అక్కడ ప్రజల బుద్ధి చెప్పారు. బిజెపి ఏ వర్గాలకు మేలు చేయలేదు, బిఆర్ఎస్ ఈ ఎన్నికలలో గెలిస్తే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. బిఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళ మెడలు ఉంచడం సాధ్యమవుతుందని, కాంగ్రెస్ వాళ్లను భూమి మీద దించాలంటే వెంకట్రామ రెడ్డిని గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ కు మంచి అభ్యర్థి దొరికాడు,  వెంకటరామిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒకాయన ఆరో తరగతి, మరొకరు బ్లాక్ మెయిలర్, బి ఆర్ ఎస్ నుండి కలెక్టర్ గా పని చేసిన వ్యక్తి ఉన్నాడు, ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తా అంటున్నాడు, ప్రజలు కార్యకర్తల దగ్గరికి వెళ్లి కాంగ్రెస్, బిజెపి మోసాల గురించి చెప్పాలని’ హరీష్ రావు వివరించారు.

Related Posts