YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భగభగమంటున్న సూరీడు

భగభగమంటున్న సూరీడు

హైదరాబాద్, ఏప్రిల్ 29
ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా 40° ఉష్ణోగ్రత అంటేనే భరించలేనంత వేడి ఉంటుంది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలకు వడగాలులు కూడా తోడవుతున్నాయి.. దీంతో ప్రజలు బయటికి వెళ్లడానికే జంకుతున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటికి వెళ్లకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం మూడు వరకు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. కాటన్ దుస్తులు ధరించాలని, సాధ్యమైనంతవరకు ఎక్కువ నీరు తాగాలని, కొబ్బరి బోండాలు, నిమ్మరసం, పండ్ల రసాలు సేవించాలని చెబుతున్నారు. మధుమేహ రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎండల్లో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట, మంథని, వెలగటూరు, వీణవంక, అల్లిపూర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా నిడమనూరు, మిర్యాలగూడ, మాతూర్ ప్రాంతాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని, ఉత్తర, భారతదేశంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని చెబుతున్నారు. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి వాతావరణం ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. కొత్తగూడెం, హనుమకొండ, గద్వాల, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నల్లగొండ, నాగర్ కర్నూల్, ములుగు, మంచిర్యాల, నారాయణపేట వంటి ప్రాంతాలలో అధిక వేడి ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్రంలో గడచిన కొద్ది రోజులుగా 40 డిగ్రీల సరాసరి ఊష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో రోడ్లపై నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ఉదయం, సాయంత్రం పూట మాత్రమే చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడికి జనాలు ఒక్కరి బిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. శుక్రవారం దాదాపు 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. గత పదేళ్లలో ఏప్రిల్‌ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈస్థాయి ఎండలు చూడటం ఇదే తొలిసారి. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్‌, ములుగు, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్‌, వనపర్తి జిల్లాలకు రెడ్‌ వార్నింగ్‌ జారీ చేసింది వాతావరణశాఖజమ్మికుంట-45.6, మంథని-45.2, నిడదమానురు-45.2, కోల్వాయి-45.1, మాడుగలపల్లి-45.1, మర్యాల-45.1, వీణవంక-45.1, వెల్గటూరు-45.1, భద్రాచలం-44, హైదరాబాద్‌-42 గా నమోదైంది..తెలంగాణలో మరో మూడు రోజులపాటు ఎండలు మండిపోనున్నాయి. వృద్దులు, పిల్లలు, వీధి వ్యాపారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. వీలయినంతవరకూ ఓర్‌ఎస్‌, చలువ చేసే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.ఏపీలోనూ భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.ఇక నిన్న ఏపీలోని నంద్యాలజిల్లా చాగలమర్రిలో 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతిజిల్లా రేణిగుంటలో 45.7, కడపజిల్లా ఖాజీపేట, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరులో 45.7, విజయనగరంజిల్లా గజపతినగరం, కర్నూలుజిల్లా కోడుమూరులో 44.8, అనంతపురంజిల్లా తాడిపత్రిలో 44.4, పల్నాడుజిల్లా మాచెర్లలో 44.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Related Posts