మునుగోడు
మద్యం కుంభకోణంలో కవిత జైలుకెళ్ళిందని రానున్న రోజుల్లో కాలేశ్వరం అవినీతి పై ధరణి కుంభకోణం పై కేసీఆర్ కేటీఆర్ కచ్చితంగా జైల్లోకి వెళ్తారని, కెసిఆర్ అనాలోచనల వల్లనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం గా మిగిల్చారు అని ఎంఎల్ఏ రాజగోపాల్ రెడ్డి అన్నారు
మునుగోడు నియోజకవర్గం లో చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ముఖ్యనేతల భారీ చేరికలు, చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆరుగురు నారాయణపురం మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు బిఆర్ఎస్ ముఖ్య నేతలు,సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో కి చేరికలు జరిగాయి
ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మరియు సాధారణ ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు దీనికి బాధ్యులైన వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు... ప్రజల్లో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంది నాలుగు నెలల క్రితం రాష్ట్రంలో ఎలాగైతే అధికారం ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా 14 ఎంపీ సీట్లు గెల్చుకొని తీరుతామని భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని తెలిపారు