YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ కంచుకోటలో ప్రచార జోరు...

టీడీపీ కంచుకోటలో  ప్రచార జోరు...

గుంటూరు
గళ్ళ మాధవిటీడీపీ పశ్చిమ అభ్యర్థిని హాట్ కామెంట్స్  గుంటూరు పశ్చిమ కంచుకోటలో వుండే సమాజం గెలవాలంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులును గెలిపించండి. జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో జరజాగ్రత్త అని టీడీపీ అభ్యర్ధి గళ్ల మాధవి అన్నారు. సామాన్య మహిళను రాజకీయంగా ముందుకు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అందుకు  సాక్షం ఈ గళ్ళ మాధవి. పేదల స్థలాల కోసం చంద్రబాబు తెచ్చిన141జీవో రద్దు చేసిన జగన్ మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టండి. టీడీపీ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కి పట్టుగొమ్మగా నిలిచింది.  కష్టకాలంలో టీడీపీ ఈ నియోజకవర్గ పరిధిలో ప్రజలు గెలిపించారు... మీపై నాకు నమ్మకం ఉంది. ఏపీని దేశంలోనే తలమానికంగా ఉన్న రాష్ట్రంగా ఉంచడానికి చంద్రబాబు మనకోసం వచ్చారు. అమరావతి ని నాశనం చేస్తే మహిళా శక్తిని వైసీపీ ప్రభుత్వ నికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.  ఎప్పత్తిదాకా జరిగిన ఎన్నికలు వేరు రేపు జరగబోయే ఎన్నికలు వేరు.  స్థానిక ప్రజలు స్వేచ్ఛ లేకుండా చేసిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్, రాబోయే ఎన్నికల్లో నిబద్ధత కలిగిన నాయుడుని ఎన్నుకోండి. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి టీడీపీ బీజేపీ జనసేన కూటమిని గెలిపించి అభివృద్ధి కి సహకరించాలని కోరారు. గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన మనం ఒక విషయాన్ని గుర్తించాలి ఏమిటంటే ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే భయంకరమైన చట్టాన్ని తెచ్చి మన ఆస్తులను సైతం దోచుకోవడానికి సిద్ధంగా  వున్నాడు జర జాగ్రత్త అని అన్నారు.

Related Posts