న్యూఢిల్లీ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎంతో పాటు పలువురికి సమన్లు ఇచ్చారు. మే 1న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు ఇచ్చారు. ఈ విషయంలో ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని ఫైరయ్యారు..