YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీఆర్ఎస్,బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదు

బీఆర్ఎస్,బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదు

పెద్దపల్లి
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బిజేపి  కార్మికులకు ఏం చేయకుండా ఓటు అడిగే నైతికహక్కు లేదని  మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
పెద్ధపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ3 ఏరియా పరిధిలోని ఒసిపి 2 బొగ్గు ఉపరితలగని గేట్ మీటింగ్ లో కాంగ్రస్ పార్టీ  పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణతో కలసి పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచార నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...
సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని,కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఇన్కమ్ టాక్స్ స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు.సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గడ్డం వంశీకృష్ణ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. యువకుడు పారిశ్రామికవేత్త అయిన వంశీకృష్ణ మన ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని వంశీకృష్ణకు మద్దతు తెలిపాలని మంత్రి శ్రీధర్ బాబు కార్మికులను కోరాడు.

Related Posts