హైదరాబాద్
ఢిల్లీ పోలీసులు గురువారం నాడు మరోసారి గాంధీ భవన్ కు వచ్చారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు లో మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లు వెల్లడించారు. పీసీసీ లీగల్ సెల్ నాయకులు అందుబాటులో లేనట్లు చెప్పడంతో మళ్లీ వస్తామని వెనుతిరిగారు. ఢీల్లీ పోలీసుల రాకను నిఘా పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో బేగం బజార్ పోలీసలు కుడా గాంధీభవన్ కు వచ్చారు.