మెదక్
ఉమ్మడి మెదక్ జిల్లాలో హోం ఓటింగ్ గురువారం ప్రారంభమయింది. సిద్దిపేట జిల్లాలో అప్లై చేసుకున్న 1183 మందికి నేటి నుంచి మే 6 వరకు హోం ఓటింగ్ జరగనుంది. సంగారెడ్డి జిల్లాలో నేడు, రేపు హోం ఓటింగ్ జరుగుతోంది. 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, వికలాంగులకు 12-D ఫామ్ తో ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది. సిద్దిపేట జిల్లాలో వృద్ధులు, వికలాంగుల ఇంటికి వెళ్లి ఎన్నికల సిబ్బంది ఓటు వెయిస్తున్నారు. మెదక్ జిల్లాలో 744 మందికి ఈ నెల 5 వరకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం వుంది