హైదరాబాద్
ఓటర్లందరూ స్వచ్ఛందంగా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసులం ప్రజలకు అండగా ఉంటామని బోరబండ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేంద్ర బలగాలతో పాటు బోరబండ పోలీసులు సైట్ 3, సైట్ 1 పలు ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ వీరశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు శాంతి భద్రతలు కల్పించేందుకు పోలీసులు నిత్యం ప్రజలకు అండగా ఉంటామన్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పై స్థాయి అధికారుల సలహాలు సూచనల మేరకు సమన్వయంతో గట్టి భద్రత ఏర్పాట్లు చేనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.