YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ కు షాక్ ఇచ్చిన మహిళా రైతు

కేటీఆర్ కు షాక్ ఇచ్చిన మహిళా రైతు

సిరిసిల్ల
సిరిసిల్ల లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా కేటీఆర్ ను బోనాల లక్ష్మీ అనే మహిళ రైతు ప్రశ్నించింది. సిరిసిల్ల పరిధిలో పెద్దూరు శివారు ప్రాంతంలో మెడికల్ కళాశాల కొరకు తీసుకున్న వ్యవసాయ భూములను తిరిగి తమకు అప్పగించాలని కేటీఆర్ ని నిలదీసిన మహిళా రైతు.
డబుల్ బెడ్ రూమ్ ఇస్తా అన్నవ్ ఇంకెప్పుడు ఇస్తారు. మా భూములు తీసుకున్నారు, మేము రందికి సచ్చి పోతున్నాం అంటూ మహిళ అనగానే రంది పడకండి..కలెక్టర్ తో మాట్లాడి తిరిగి మీ జాగా తిరిగి ఇప్పించే బాధ్యత, ఫ్లాట్ కూడా వచ్చేలా చూస్తానని టెన్షన్ పడద్దని చెబుతుండగానే ఇంకెఎన్నడు ఇప్పిస్తారు అంటూ నిలదీసింది. మా మార్కెట్ లో సౌలతులు సక్కగా లేవు, దొంగలు, లంగాలు వస్తున్నారు..మమ్మల్ని బెదిస్తున్నారు అంటూ కేటీఆర్ కి చెప్పింది. ఏం రంది పడకండి నేను అన్ని చూసుకుంటా అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Related Posts