YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచింది

కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచింది

రాజన్న సిరిసిల్ల
సోమవారం ఉదయం దయం సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ లోనీ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుకోసం పలు వార్డులలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. కార్నర్ మీటింగ్ పాల్గొన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ నేత కార్మికుల కోసం 3 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసుకొని కార్మికులను కాపాడుకున్నం. 5 ఏళ్లలో ఒక్క రూపాయి మందు పంచలేదు.  మీరు  నాకు ఇచ్చిన దయ. రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల నే. సిరిసిల్ల పట్టణం అతి సుందరంగా తీర్చి దిద్దుకున్నం. మీరు నన్ను ఇక్కడా గెలిపించిన కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచింది. మోచేతికి బెల్లం పెట్టీ మోసపూరిత హామీలతో గెలిచింది. ఆరు గ్యారంటీ లో ఒక్కటి అమలు చేసి మోగొల్లకు మహిళకు తకులాట పెట్టిండు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండి.అబద్ధాలు చెపితే డిజిటల్ ప్రపంచలో ఒక్క నిమిషాల్లో  దొరికిపోయారని అన్నారు.
అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది కెసిఆర్ ప్రభుత్వం పోయాకా. తెలంగాణ తెచ్చిన కెసిఆర్ ను పట్టుకొని  కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు, భుతులు మాట్లాడుతున్నారు.100 రోజుల్లో రైతు రుణమాఫీ, ఫించన్లు వచ్చాయా.ఓట్లు చేసుకునేటప్పుడు ఒక లెక్క ఓట్లు వేయించుకున్నాకా ఒక లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు.  కెసిఆర్ మల్ల కావాలంటే 13 తేదీన కారు గుర్తుకు వేసి గెలిపించండి. తెలంగాణలో శాసించే అధికారం వస్తుంది. రాముడు అందరి వాడు. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారు. వేములవాడ రాజన్న, కొండగట్టు దేవాలయాలు బిజెపి పుట్టక ముందు నుండే ఉండేవి. సిరిసిల్లలో అనేక అభివృద్ధి పనులు చేసినా, బీజేపీ ఒక్క పని చేసిండా శిలాఫలకం అన్న వేసిండా వారికి ఎందుకు ఓటు వేయాలి. మోడీ ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ రెట్లపై పన్నులు వేసి వసూలు చేసారు.మనకు ప్రధాన మంత్రి కాదు ఫైరమైన ప్రధాన మంత్రి. ఆప్ కీ బార్ 420 అంటున్నారు. అక్కరికి  రానీ సుట్టాలకు ఎందుకు ఓటు వేయాలి. నాకు జోడి దారు దొరికితే రాష్ట్రం, కేంద్రం పై పోరాడే శక్తి వస్తుందని అన్నారు.

Related Posts