హైదరాబాద్
దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు, రాజ్యాంగ రక్షణకోసం తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి, దానం నాగేందర్ కు ఇస్తున్నట్లు మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జీ. చెన్నయ్య స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా న్యూ బోయిగూడలో మాల ప్రజా సంఘాల జేఏసీ నాయకులతో కలిసి చెన్నయ్య ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియా సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ బీజేపీ మతతత్వ, కులతత్వ పార్టీ అని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న, రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా పని చేస్తున్న బీజేపీ ని గద్దె దించడమే ద్యేయంగా పని చేయనున్నట్లు తెలిపారు. 10ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కూడా దళిత బహుజనుల కోసం చేసిందేమీ లేదని వెల్లడించారు..