వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలో రేపు జరిగే బిజెపి బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు.. ఈ మేరకు బిజెపి నాయకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు రాజన్నను దర్శించుకొని, కోడె మొక్కు చెల్లిస్తారు. తదనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మద్దతుగా పట్టణంలోని బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు కేంద్ర భద్రత సిబ్బంది మోడీ పర్యటన సందర్భంగా భద్రత అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న ఆలయ గుడి చెరువులో నాలుగు హెలిప్యాడ్ లను సిద్ధం చేశారు. ఉదయం హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. రాజన్న దర్శించుకునే తొలి ప్రధానిగా నరేంద్ర మోడీ కానున్నారు.