నిజామబాద్
దేశం అభివృద్ధి కావాలంటే మరోసారి నరేంద్రమోది ప్రధాని కావాలని అన్నారు నిజామాబాద్ ఎంపి అభ్యర్థి దర్మపురి అరవింద్. ప్రపంచంలో భారత దేశాన్ని విశ్వగురువుగా చేసిన ఘనత మోదికే దక్కుతుందని తెలిపారు. మోపాల్ మండల కేంద్రం లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. నిజామాబాద్ లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నారని, జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కూడా బిజెపి తోనే సాద్యమన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ మరింత అభివృద్ధి కావాలంటే బిజెపి ని గెలిపించాలని కొరారు..