కరీంనగర్
కరీంనగర్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది.ఎంపి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరారు. 50వ డివిజన్ కార్పొరేటర్ కొలిపాక అంజయ్య, 46వ డివిజన్ కార్పొరేటర్ వంగల శ్రీదేవి పవన్ కుమార్ సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ జడ్పీటీసీ ఎడ్ల శ్రీను, 47 డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు అన్నపూర్ణసహా వందలాది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు.