YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ యాత్రను విజయవంతం చేయాలి

కేసీఆర్ యాత్రను విజయవంతం చేయాలి

పటాన్ చెరు
బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా బుధవారం సాయంత్రం ఐదు గంటలకు పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ చౌరస్తా నుండి ముత్తంగి మీదుగా పటాన్చెరు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణం డివిజన్ల నుండి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అభిమానులు శ్రేయోభిలాషులు రోడ్ షో కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం 05 గంటల నుండి 9 గంటల వరకు రోడ్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దశాబ్ది కాలంలో మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని 9వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడం జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దరంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ప్రజల ఆర్థిక స్వావలంబనకు చేయూతను అందించామని తెలిపారు. రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా కార్మికుల కోసం 300 కోట్ల రూపాయలతో 200 పడకల ఆసుపత్రి అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు.కెసిఆర్ రోడ్డు షోను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి ఆయన విజ్ఞప్తి చేశారు.

Related Posts