YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు డైరెక్షన్ లో ఎన్నికల కమిషన్

చంద్రబాబు డైరెక్షన్ లో ఎన్నికల కమిషన్

తాడేపల్లి
రాష్టంలో సంక్షేమ పథకాలను అడ్డుకున్నారు.అధికారంలోకి వస్తే పూర్తిగా ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తుందని వైసీపీ నేత అడపా శేషు అన్నారు. పథకాలు ఆపడానికి కారణం ఏంటి..పక్క రాష్టంలో ఎందుకు నిలుపుదల చేయలేదు. ప్రతి పేదవానికి పథకం వచ్చింది కాబట్టి జగన్ యాత్రకి ప్రజలు వస్తున్నారు. మోడీకి వంగి వంగి లోకేష్,పవన్ కళ్యాణ్ దండం పెడుతున్నారు..రాష్టం గురించి ఎందుకు మాట్లాడలేదు. సంక్షేమ పథకాలు ఆగడానికి కారణం చంద్రబాబు.ఆయన అధికారంలోకి పథకాలు ఆగిపోతాయి. విద్యా దీవెన ఆగిపోతే విద్యార్థుల ఇబ్బందులు పడతారని తెలియదా..రైతుల సబ్ సిడి రాకుండా చేస్తున్నారు. ఒక్క హామీ అయినా చంద్రబాబు నెరవేర్చడా.ఆయనను పవన్ కళ్యాణ్ భుజాన వేసుకొని తిరుగుతున్నాడు. జగన్ పై ఆరోపణలు చేయడానికి పవన్ కళ్యాణ్ కి సిగ్గు ఉండాలి. చంద్రబాబు ఉన్నత వర్గాలకి దోచి పెట్టడం తెలుసు.కాపు నేస్తం ద్వారా కోటి మందికి మంచి చేసామని అన్నారు.
చంద్రబాబు హయాంలో 700 కోట్లు ఖర్చు చేస్తే మేము 65 వేల కోట్లు కాపుల కోసం ఖర్చు చేసాము. ప్రతి కులాన్ని అభివృద్ధి చేయాలనేదే జగన్ ఆలోచన.చంద్రబాబు,పవన్ కక్ష సాధింపు చర్యలు ఆపాలి.చంద్రబాబు రాజకీయంలో పవన్ కళ్యాణ్ బలి అయ్యాడు.కాపుల ఓటమికి కారణం పవన్ కళ్యాణ్.చంద్రబాబుని అధికారంలోకి తీసుకురాడానికి కాపులను పవన్ బలి చేస్తున్నాడు. చంద్రబాబు నక్క జిత్తుల వేషాలకి అనేక కుటుంబాలు బలి అయ్యాయి.అందులో వంగవీటి,ముద్రగడ కుటుంబాలు ఉన్నాయి. ప్రతి పేదవానికి వంగవీటి రంగా ఆశయాల కోసం పని చేయాలి.మోడీ పెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి గ్లోబల్ ప్రచారం చంద్రబాబు,పవన్ చేస్తున్నారు.ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో ఉన్న లోపాలను మార్చి తర్వాత అమలు చేయడానికి పక్రియ జరుగుతుంది.లక్షల ఎకరాలు పేదవాళ్ళకి జగన్ పంచితే చంద్రబాబు,పవన్ ఎక్కడ ఉన్నారని అన్నారు.

Related Posts