యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భవనగిరి లోక్ సభ కాంగ్రెస్ కి కంచుకోట. సాధారణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి మంచి మెజారిటీ వచ్చింది. వరుణుడు కూడా వర్షపు జల్లుతో ఆశీర్వదించాడు. గతంలో ఆగిపోయిన పథకాలు అన్నింటిని కొనసాగిస్తాం. రూ.7,624 కోట్లు రైతులకు ఇవ్వాలని భావించాం. రైతుల ఖాతాలో నగదు జమ చేద్దాం అనుకుంటే కొంతమంది ఫిర్యాదులు చేశారు. ఈసీ ఆదేశాలు వలన రైతుల ఖాతాలో నగదు జమ చేయలేకపోయామని అన్నారు.
భాజపా, భారాస చెప్పే అసత్య ప్రచారాలను నమ్మకండి. భారాస, భాజపా లకి ఒకటి రెండు సీట్లు వస్తే నయమే. కాంగ్రెస్ కి 14 సీట్లు రాబోతున్నాయి. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగిన వెంటనే మరమ్మతులు చేస్తున్నారు. విద్యుత్ కి అంతరాయం లేకుండా చూస్తున్నాంమని అన్నారు.