YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బోత్సకు కౌంటర్ ఇచ్చిన పురందేశ్వరి

బోత్సకు కౌంటర్ ఇచ్చిన పురందేశ్వరి

విజయవాడ
మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఘాటు కౌంటర్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యల పై మండి పడ్డారు. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంద న్నట్లు ఘాటు వ్యాఖ్య చేసరు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుంది. బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. విశాఖ రైల్వే జోన్ కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదు. వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్ కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకో లేకపోయారు. పసలేని ఆరోపణలు చేయడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించుకోవాలని అన్నారు.

Related Posts