YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

తానేంటో నిరూపించిన సైనా

 తానేంటో నిరూపించిన   సైనా

- ఫైనల్లో సైనా.. సెమీస్‌‌లో గెలుపు

సైనా నెహ్వాల్ మళ్లీ తానేంటో నిరూపించుకుంది. కొన్ని రోజులు ఫామ్‌ను కోల్పోయినంత మాత్రాన తనలో ఇంకా ఆ సత్తా తగ్గలేదని చూపించింది. ఇండోనేషియా మాస్టర్స్‌లో ఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో సింధును ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టిన సైనా నెహ్వాల్.. సెమీస్‌లోనూ ప్రపంచ నాలుగో ర్యాంకు క్రీడాకారిణి, థాయిలాండ్‌కు చెందిన రషనోక్ ఇంథనోన్‌ను ఓడించింది దర్జాగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. 48 నిముషాల పాటు సాగిన గేమ్‌లో 21-19, 21-19 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టి కరిపించింది. కాగా, తొలి సెట్లో 6-10తో వెనకబడిన సైనా నెహ్వాల్.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని ముందుకు దూసుకుపోయింది. ఇక, రెండో సెట్లోనూ తొలుత ఆధిపత్యం ప్రదర్శించిన సైనా.. ఆ తర్వాత కొంత వెనకబడింది. రెండో సెట్లో ఇద్దరి మధ్యా హోరాహోరీ పోరు సాగింది. ఆ హోరాహోరీ పోరులో సైనానే విజయం వరించింది. ఇక, ఆదివారం చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ నంబర్ వన్ తై జు యింగ్, చైనాకు చెందిన ఎనిమిదో సీడ్ హే బింగ్‌జియావోల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ఫైనల్లో సైనా తలపడనుంది.

Related Posts