హైదరాబాద్
కేపి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో 53 లక్షల 35 వేల 700 నగదు పోలీసులు సీజ్ చేసారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి ఈ డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేసారు. ఎంజీఎం కన్స్ట్రక్షన్ ఓనర్ మురళి చెప్పిన ప్రకారం మెహదీపట్నంలోని వివిధ ప్రాంతాలలో డబ్బులు కలెక్ట్ చేసుకుని వసంత్ నగర్ లోని ఎంజీఎం కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ కి వెళ్తుండగా పట్టుకున్నారు.