YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనకు న్యాయవాదుల మద్దతు

జనసేనకు న్యాయవాదుల మద్దతు

పిఠాపురం
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చెయ్యాలని గత వంద రోజులుగా న్యాయవాదులు  ప్రశ్నిస్తున్న ఏ రాజకీయ పక్షాలు స్పందించలేదని, టిడిపి జనసేన బిజెపి కూటమి ముందుకు వచ్చి తామ అధికారం చేపట్టిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చెప్పడం జరిగిందని అందుకు కూటమి పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఓటు వేయాలని ర్యాలీ నిర్వహిస్తున్నామని న్యాయవాది నగేష్ తెలిపారు.
కాకినాడ జిల్లా పిఠాపురం కోర్టు నుండి న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గెలిపించాలని, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాద నగేష్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నీతి ఆయోగ్, సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం తెమ్మని చెప్పిందని వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని అన్నారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కవర్ పేజీని వాడుకుని  జగన్  లోపల పేజీలన్నీ తమకు నచ్చిన విధంగా రాసుకుని ప్రజలకు అన్యాయం చేస్తోందని ఈ సందర్భంగా నగేష్ అన్నారు. వివిధ నియోజకవర్గాల  న్యాయవాదులు  ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Related Posts