YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్

మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్

వికారాబాద్
మోసపూరిత మాటలతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడగొట్టాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వికారాబాద్ నియోజకవర్గ మొత్తములో కేవలం వికారాబాద్ పట్టణంలో మాత్రమే శివారెడ్డి పెట్ చెరువు నుండి నల్లా ద్వారా నీరు అందించామని కానీ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ మంచి ఉద్దేశంతో  తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి నల్లాను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పాడైపోయిన నల్లాలను రిపేరు చేయలేని పరిస్థితుల్లో ఉందని వంద రోజులలో రైతు రుణమాఫీ చేస్తామని, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని ప్రజలను నమ్మించి నిండా ముంచారని అన్నారు. మళ్ళీ ఒకేసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు అదేవిధంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం కులాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి   మైనార్టీ ప్రజలను విడగొడుతున్నారని అన్నారు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలతో నాకు విడదీయలేని బంధం ఉందని బిసి బిడ్డను అయినటువంటి నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

Related Posts